IRCTC Karnataka Tour : కర్ణాటకలోని 5 పుణ్యక్షేత్రాల సందర్శన, హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ ఇదే!

3 months ago 69
ARTICLE AD

IRCTC Karnataka Tour : కర్ణాటకలోని ప్రముఖ దేవాలయాల సందర్శనకు డివైన్ కర్ణాటక పేరుతో ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. హైదరాబాద్ నుంచి 6 రోజుల పాటు కర్ణాటకలోని ధర్మస్థల, మంగుళూరు, శృంగేరి, ఉడిపి, కుక్కే సుబ్రమణ్య క్షేత్రాలను దర్శించుకోవచ్చు. ప్రతి మంగళవారం హైదరాబాద్ నుంచి ట్రైన్ బయలుదేరుతుంది.

ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ టారిఫ్: (1 నుంచి 3 మంది)

క్లాస్సింగిల్ ఆక్యుపెన్సీడబుల్ ఆక్యుపెన్సీట్రిపుల్ ఆక్యుపెన్సీచైల్డ్ విత్ బెడ్(5-11 సంవత్సరాలు)చైల్డ్ వితవుట్ బెడ్(5-11 సంవత్సరాలు)
కంఫర్ట్(3A)రూ.37350రూ.21920రూ.17690రూ.10220రూ.9110
స్టాండర్ట్(SL)రూ.34360రూ.18920రూ.14700రూ.7230రూ.6110

ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ టారిఫ్: (4 నుంచి 6 మంది)

క్లాస్డబుల్ ఆక్యుపెన్సీట్రిపుల్ ఆక్యుపెన్సీచైల్డ్ విత్ బెడ్(5-11 Years)చైల్డ్ వితవుట్ బెడ్(5-11 years)
కంఫర్ట్(3A)రూ.18890రూ.16800రూ.11190రూ.9800
స్టాండర్డ్(SL)రూ.15890రూ.13800రూ.8200రూ.6800

పర్యటన ఇలా : ఉడిపి - శృంగేరి - ధర్మస్థల - కుక్కే - మంగళూరు (05 రాత్రులు / 06 రోజులు)

డే 01 : మంగళవారం

కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 06:05 గంటలకు కాచిగూడ - మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్‌(నెంబర్ 12789) బయలుదేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ చేస్తారు.

డే 02 : బుధవారం

ఉదయం 09:30 గంటలకు రైలు మంగళూరు సెంట్రల్ చేరుకుంటుంది. రైల్వే స్టేషన్ లో పర్యాటకులను పికప్ చేసుకుని ఉడిపికి తీసుకెళ్తారు. హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. అనంతరం శ్రీ కృష్ణ దేవాలయం, మల్పే బీచ్ సందర్శిస్తారు. రాత్రి ఉడిపిలో బస చేస్తారు.

డే 03 : గురువారం

హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి శృంగేరికి బయలుదేరతారు. శృంగేరి శారదాంబ ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత మంగుళూరు బయలుదేరివెళ్తారు. మంగుళూరు చేరుకుని హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. మంగుళూరులో రాత్రి బస చేస్తారు.

డే 04 : శుక్రవారం

ఉదయం మంజునాథ ఆలయాన్ని సందర్శించేందుకు ధర్మస్థలానికి బయలుదేరతారు. అనంతరం కుక్కే సుబ్రహ్మణ్యానికి వెళ్తారు. సాయంత్రం తిరిగి మంగుళూరు చేరుకుని రాత్రి బస చేస్తారు.

డే 05 : శనివారం

మంగుళూరులోని స్థానిక దేవాలయాలు మంగళ దేవి ఆలయం, కద్రి మంజునాథ దేవాలయం సందర్శిస్తారు. స్థానికంగా షాపింగ్ చేసుకోవచ్చు. సాయంత్రం తన్నెరభావి బీచ్, కుద్రోలి గోకర్నాథ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి 7:00 గంటలకు మంగుళూరు సెంట్రల్‌ రైల్వేస్టేషన్ లో డ్రాప్ చేస్తారు. రైలు నం. 12790లో తిరిగి హైదరాబాద్ కు రాత్రి 08:05 గంటలకు బయలుదేరతారు. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.

డే 06 : ఆదివారం

రాత్రి 11:40 గంటలకు కాచిగూడ చేరుకుంటారు. దీంతో పర్యటన ముగుస్తుంది.

డివైన్ కర్ణాటక ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ బుకింగ్, పూర్తి వివరాలను కింద లింక్ లో చెక్ చేయండి.

Read Entire Article