Sircilla Crime : సిరిసిల్ల జిల్లాలో గంజాయి గ్యాంగ్ గుట్టురట్టు, గంజాయి చాక్లెట్లు సీజ్

2 months ago 84
ARTICLE AD

Sircilla Crime : గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు. ఈ ముఠాకు చెందిన నలుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ వారి నుంచి 4 కిలోల 700 గ్రాముల గంజాయి, 30 గ్రాముల గంజాయి చాక్లెట్స్ , 4 సెల్ ఫోన్ లు, 2 బైక్ లు, 2 బ్యాగ్ లు స్వాధీనం చేసుకున్నారు. సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో సిరిసిల్లలో పట్టుబడ్డ వారిని చూపించి వివరాలు వెల్లడించారు. సిరిసిల్ల అంబేడ్కర్ నగర్ కు చెందిన పేరుక వెంకటేష్, పెద్దపల్లి జిల్లా పెద్దబొంకూర్ కు చెందిన కలవేన ప్రవీణ్ కుమార్, మంచిర్యాల జిల్లా మదురానగర్ కు చెందిన నార్ల అక్షయ్, హైదరాబాద్ రాంనగర్ చెందిన అలెగ్జెండర్ జోసెఫ్, పెద్దపల్లి అమర్ నగర్ కు చెందిన బండి సాయిచరణ్, కరీంనగర్ లోని మంకమ్మతోట చెందిన మీస సాయి రామ్... ఈ ఆరుగురు ముఠాగా ఏర్పడి గంజాయి సేవించడంతోపాటు సప్లై చేస్తున్నారని ఎస్పీ తెలిపారు. సిరిసిల్లలో అమ్మడానికి ప్రవీణ్, సాయిచరణ్, సాయిరామ్ లు బైక్ పై కొత్తచెరువు వద్ద గల స్మశానవాటిక వద్దకు వచ్చి సాయి చరణ్ తనకు తెలిసిన వ్యక్తులకు ఫోన్ చేయగా వెంకటేష్, అక్షయ్, జోసెఫ్ లు అక్కడికి చేరుకున్నారు. గంజాయి, గంజాయితో తయారు చేసిన చాక్లెట్ విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకునే క్రమంలో సాయిచరణ్ , సాయిరామ్ డబ్బులతోపాటు కొంత గంజాయితో పారిపోయారని ఎస్పీ చెప్పారు. ప్రవీణ్, వెంకటేష్, అక్షయ్, జోసెఫ్ లను అరెస్టు చేశామన్నారు.

Read Entire Article