TS POLYCET Counselling 2024 : నేటి నుంచే 'పాలిసెట్' కౌన్సెలింగ్‌ - జూన్ 30న సీట్ల కేటాయింపు, ముఖ్య తేదీలివే

2 months ago 93
ARTICLE AD

TS POLYCET Counselling 2024 : తెలంగాణ పాలిసెట్ 2024 ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఫస్ట్ ఫేజ్ కు సంబంధించి నేటి నుంచే రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఫీజు చెల్లింపు, వెబ్ ఆప్షన్ల ఎంపిక తర్వాత…. జూన్ 30వ తేదీన సీట్లు కేటాయిస్తారు.

పాలిసెట్ తొలి విడత కౌన్సెలింగ్ లో భాగంగా జూన్  22 నుంచి ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. జూన్ 25వ తేదీ వరకు వెరిఫికేషన్ ఉంటుంది. జూన్ 22వ తేదీ నుంచే 27 వరకు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. జూన్ 30వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్లను విద్యార్థులకు కేటాయిస్తారు.

ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో మొత్తం 26,412 సీట్లు ఉన్నాయి. ఇందులో  57 ప్రభుత్వ కాలేజీలు ఉండగా… 58 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి.

పాలిసెట్ కౌన్సెలింగ్ ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ :

జూన్ 20 - పాలిసెట్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభంజూన్ 22 - 25 :  సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌,జూన్   22 నుంచి 27 : అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.జూన్  30 -  విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు.

రెండో విడత కౌన్సెలింగ్ :

 జూలై 7వ తేదీ నుంచి నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ మొదలు కానుంది.జులై 9వ తేదీన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జరగనుంది. జులై 13వ తేదీన సీట్లను కేటాయింపు ఉంటుంది.జులై 21వ తేదీ నుంచి ఇంటర్నల్ స్లైడింగ్‌ అవకాశం కల్పించారు.జులై 23వ తేదీన స్పాట్ అడ్మిషన్ మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు.

తెలంగాణ పాలిసెట్ ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి

Step 1 : అభ్యర్థులు పాలిసెట్ అధికారిక వెబ్ సైట్ https://www.polycet.sbtet.telangana.gov.in/  పై క్లిక్ చేయండి.Step 2 : హోంపేజీలోని ర్యాంక్ కార్డు ఆప్షన్ పై క్లిక్ చేయండి.Step 3 : ఆ తర్వాత పేజీలో లాగిన్ వివరాలు నమోదు చేయండి. రిజిస్ట్రేషన్/మొబైల్ నంబర్ లేదా హాల్‌ టికెట్ నెంబర్‌... పాస్ వర్డ్ ఎంటర్‌ చేయండి.Step 4 : ర్యాంక్‌ కార్డు స్క్రీన్‌పై డిస్‌ ప్లే అవుతుంది. ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోండి.

పాలిసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు https://www.polycet.sbtet.telangana.gov.in/  వెబ్ సైట్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. రాష్ట్రంలోని డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి మే 24 పాలిసెట్ పరీక్షను నిర్వహించారు. వీటి ఫలితాలు కొద్దిరోజుల కిందటే విడుదలయ్యాయి. ఈ ఏడాది పాలిసెట్ పరీక్షను 82,809 మంది విద్యార్థులు రాశారు.

దోస్త్ తుది విడత కౌన్సెలింగ్….

TS DOST 2024 Phase 3 Registration: తెలంగాణలో దోస్త్ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు విడుతల పూర్తి కాగా.. మూడో విడత జూన్ 19 నుంచి ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు డిగ్రీ ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

'దోస్త్' మూడో విడత వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ జూన్ 19 నుంచి ప్రారంభమైంది. జులై 2 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఇప్పటికే రెండో విడతలో 41,533 మందికి డిగ్రీ సీట్లు పొందారు.

దోస్త్ ద్వారా రాష్ట్రంలోని 1,066 డిగ్రీ కళాశాలల్లో మొత్తం 4,49,449 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దోస్త్ ప్రక్రియ ద్వారా ఈ సీట్లన్నీ భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే రెండు దశలు పూర్తి కాగా… మూడో విడత ద్వారా మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నారు. అన్ని విడతలు పూర్తి అయితే… స్పాట్ అడ్మిషన్ల కోసం ఉన్నత విద్యామండలి గైడ్ లైన్స్ ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం 3 విడతల్లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయనుంది తెలంగాణ ఉన్నత విద్యా మండలి. ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్థులు రూ.200 చెల్లించాలి. ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మే 6వ తేదీ నుంచే ప్రారంభమైంది. గత ఏడాది కూడా ఇదే మాదిరిగా డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసింది. https://dost.cgg.gov.in/  వెబ్ సైట్ లోకి ఇతర అప్డేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు.

Read Entire Article