సింగరేణిని బలోపేతం చేసిందే బీఆర్ఎస్ - పోరాడి కాపాడుకుంటాం - కేటీఆర్

2 months ago 61
ARTICLE AD

KTR On Singareni Collieries : సింగరేణి పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, సింగరేణి ప్రాంత నాయకులు,  బొగ్గు గని కార్మిక సంఘం నాయకులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ సమావేశమయ్యారు. గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన ఈ భేటీలో బొగ్గు గనుల వేలంపై ప్రధానంగా చర్చించారు. 

ప్రైవేటీకరించేందుకు కుట్ర….

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్… బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలపై ఫైర్ అయ్యారు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని ఆరోపించారు. కేంద్రంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కయ్యారని దుయ్యబట్టారు. లాభసాటిగా ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సింగరేణి నష్టాల్లో ఉందంటూ పెట్టుబడుల ఉపసంహరణ కోసం సిద్ధం చేస్తున్నారని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై  నవ్వుకుంటూ సింగరేణి గనులను అమ్మకానికి పెట్టినట్లు ప్రతి సింగరేణి కార్మికుని అర్థమవుతోందన్నారు. 

కేసీఆర్ భుత్వ రంగ సంస్థలతో ఉద్యమ కాలం నాటి నుంచే పనిచేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. సకల జనుల సమ్మె సమయంలో సింగరేణి ప్రాధాన్యతను దేశం గుర్తించిందన్నారు. సమ్మె కాలంలో ఐదు దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయని గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తెలంగాణ ఉద్యమ కాలంలో అద్భుతంగా పనిచేశాయని చెప్పారు.

“హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు గొప్పగా పని చేశాయి. ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం అనేది మా పార్టీ విధానం. ఉద్యమ కాలం నుంచి...ఆ తర్వాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇదే మా విధానం. అందుకే ప్రైవేటు కంపెనీలు ఎంత ఒత్తిడి తెచ్చిన పక్కకు పెట్టి... రైతు బీమాను ఎల్ఐసీకి ఇచ్చాం. విద్యుత్ ప్రాజెక్టులను కట్టే బాధ్యతలను బీహెచ్ఈఎల్ కి అప్పగించాం” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు.

సింగరేణిని కాపాడుకుంటాం - కేటీఆర్

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్ల పాటు సింగరేణి సంస్థ అభివృద్ధి, విస్తరణ కోసం ఎంత పనిచేశామో ప్రతి సింగరేణి కార్మికునికి అవగాహన ఉందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొమ్మిది సంవత్సరాలకు పైగా తెలంగాణ బొగ్గు గనులను వేలం వేయకుండా ఆపగలిగారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రెండు బొగ్గు గనులను ప్రైవేట్ సంస్థలకు కేటాయించినప్పటికీ...తట్టెడు తెలంగాణ బొగ్గును ఎత్తకుండా విజయవంతంగా అడ్డుకున్నామని పేర్కొన్నారు.

“ప్రభుత్వంలోకి వచ్చి ఆరు నెలలు కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం... గెలిచి రెండు వారాలు కాకముందే బీజేపీ ఎంపీలు ఆ పార్టీ నాయకత్వం కలిసి తెలంగాణ బొగ్గు గనులను వేలంకు పెట్టాయి. తెలంగాణ గొంతుక పార్లమెంట్లో లేదన్న భ్రమతోనే కాంగ్రెస్, బీజేపీలో ఈ కుటిల ప్రయత్నం చేస్తున్నాయి. కానీ సింగరేణి కోసం ఆది నుంచి పోరాటం చేసి... సింగరేణిని బలోపేతం చేసిందే బీఆర్ఎస్. సింగరేణి కష్టాల్లో ఉంటే కార్మికులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్న విషయం మర్చిపోతున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణిని కాపాడుకుంటాం” అని కేటీఆర్ పునరుద్ఘాటించారు.

Read Entire Article