కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత

1 year ago 645
ARTICLE AD

D.Srinivas Passed Away : కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ కన్నుమూశారు. తెల్లవారుజామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో మరణించినట్లు కుటుంబసభ్యలు తెలిపారు

డి.శ్రీనివాస్ కన్నుమూత

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌(డీఎస్) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా డీ. శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు.  గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 

డి.శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ పార్టీలో చేరి…. రాజ్యసభ ఎంపీగా పని చేశారు.

Read Entire Article
💬 Chat